జాతీయ ఫుట్బాల్ జట్టులో సభ్యురాలిగా ఉన్నప్పుడు.. జట్టులోని క్రీడాకారిణుల పట్ల జరిగిన లైంగిక వేధింపులు, అమానవీయ ఘటనల గురించి సంచలన విషయాలను సోనా చౌదరి వెల్లడించారు. భారత మహిళా ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఆమె.. క్రీడాకారుణులుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తాజా పుస్తకంలో వివరించారు. 'గేమ్ ఇన్ గేమ్' పేరిట రాసిన ఈ పుస్తకాన్ని ఇటీవల వారణాసిలో విడుదల చేశారు.టీమ్ మేనేజ్మెంట్, కోచ్, సెక్రటరీ ఇలా ప్రతి ఒక్కరూ తమను లైంగిక వేధించేవారని, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఈ వేధింపులు తప్పేవి కావని సోనా చౌదరి తన పుస్తకంలో తెలిపారు.
తాను జాతీయ జట్టులో క్రియాశీలంగా ఉన్న రోజుల్లో తమపట్ల అమానవీయ ఘటనలు జరిగేవని వివరించారు. జట్టులో స్థానం కోసం క్రీడాకారిణులను లోబర్చుకునేందుకు మేనేజ్మెంట్ సిబ్బంది ప్రయత్నించేవారని, నిత్యకృత్యంగా జరిగే ఈ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి క్రీడాకారుణులు తాము లెస్బియన్ తరహాలో వ్యవహరించేవారని ఆమె వివరించారు.ఒక్క జాతీయ జట్టులో మాత్రమే కాదు.. రాష్ట్రస్థాయిలోనూ, ఇతర స్థాయిల్లోనూ మహిళా ఆటగాళ్లపై లైంగిక వేధింపులు జరిగేవని, అలాంటివాటికి రాజీపడలేక వారు మానసిక క్షోభకు గురయ్యేవారని పేర్కొన్నారు.
విదేశీ పర్యటనల సందర్భంలో కోచ్లు, స్టాఫ్ సభ్యుల బెడ్లను మహిళా ఆటగాళ్ల గదిలో ఉంచేవారని, దీని గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవాళ్లు కాదని ఆమె వెల్లడించారు.1998లో ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా సోనా చౌదరి మోకాలికి, వెన్నెముకకు గాయం కావడంతో ఆమె కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. దీంతో ఫుట్బాల్ నుంచి రిటైరైన ఆమె ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు. ఆమె తాజా పుస్తకంలో చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి సరబానంద్ సోనోవాల్ స్పందించారు. ఈ ఆరోపణలపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more